ప్రసాద్ భార్య మృతదేహం లభ్యం

ఉమ్మడి జిల్లా లో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసులో ప్రసాద్ భార్య రమ్య మృతదేహం లభ్యం అయినట్లు నార్త్ రూరల్ సీఐ సతీష్ తెలిపారు.

Update: 2023-12-21 13:25 GMT

దిశ,నవీపేట్ : ఉమ్మడి జిల్లా లో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసులో ప్రసాద్ భార్య రమ్య మృతదేహం లభ్యం అయినట్లు నార్త్ రూరల్ సీఐ సతీష్ తెలిపారు. సీఐ సమాచారం ప్రకారం మాక్లూర్ కు చెందిన నిందితుడు ప్రశాంత్ స్నేహితుడు ప్రసాద్ ఫ్యామిలీ లో అరుగురిని హత్య చేసిన విషయం తెలిసిందే. భార్య రమ్య ని హత్య చేసి బాసర గోదావరి లో పడేసినట్లు చెప్పడం తో గురువారం పోలీసులు గజ ఈతగాళ్ల తో గాలించగా శవం దొరికింది. ఘటన స్థలంలోనే శవాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి అంబులెన్సు లో తీసుకు వెళ్లారు. సంఘటన స్థలం లో ఉమ్మడి జిల్లా పోలీస్ లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, సదశివానగర్ సీఐ రమణ, స్థానిక ఎస్ఐ యాదగిరి గౌడ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. 


Similar News