ఎందుకోసం ఈ సంబురాలు..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణ మాఫీ కాకముందే, కాంగ్రెస్ నాయకులు ఎందుకోసం సంబరాలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజంపేట సొసైటీ వైస్ చైర్మన్ ఆంద్యాల రమేష్, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.

Update: 2024-07-18 15:28 GMT

దిశ, భిక్కనూరు : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణ మాఫీ కాకముందే, కాంగ్రెస్ నాయకులు ఎందుకోసం సంబరాలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజంపేట సొసైటీ వైస్ చైర్మన్ ఆంద్యాల రమేష్, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. గురువారం నాడు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, కొర్రీలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, కల్యాణ లక్ష్మి పథకం కింద అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినందుకా, లేక వృద్ధాప్య పెన్షన్ 4000 చెల్లిస్తామని చెప్పి, ఇవ్వనందుకా ఏం సాధించారని ఈ సంబరాలంటూ సెటైర్ వేశారు. రైతు భరోసా కింద కౌలు రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు చెల్లిస్తామని, ఆటోవాలలకు 12 వేల రూపాయల సాయం చేస్తామని చెప్పి ఇంతవరకు మాట నిలబెట్టుకోలేకపోయారని అధికార పార్టీ నాయకుల పై మండిపడ్డారు.

Tags:    

Similar News