అధికారం లేదని కార్యకర్తలు అధైర్య పడొద్దు

అధికారం లేదని కార్యకర్తలు అధైర్య పడొద్దు అని మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు.

Update: 2023-12-17 14:54 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : అధికారం లేదని కార్యకర్తలు అధైర్య పడొద్దు అని మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయం లో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ గణేష్ బిగాల మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్య పడొద్దని, ఎప్పటిలాగే ప్రజల సమస్యలపై స్పందిస్తూ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. మనకు పదవులు కొత్త కాదు అన్నారు. మనం వచ్చింది ఉద్యమ పార్టీ నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకెళదాం అని అన్నారు. సమావేశంలో మేయర్ నీతూ కిరణ్ ,పార్టీ నగర అధ్యక్షులు, కార్యదర్శి సిర్ప రాజు, ఏనుగందుల మురళి, నూడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News