రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమేష్ (23) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.
దిశ, లింగంపేట్: లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమేష్ (23) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ఉమేష్ కుటుంబ సభ్యులు మెదక్ పట్టణంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. కాగా ఎల్లారెడ్డి పట్టణంలోని జియో కంపెనీలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడని.. లింగంపేట నుండి మెదక్కు వెళ్తుండగా గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొనడం వల్ల ఉమేష్కు బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ ప్రభాకర్తో పాటు సంగారెడ్డి గ్రామ సర్పంచ్ అనిల్ రెడ్డి నాయకులు మోహిద్ తదితరులు సందర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.