రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

మండలంలోని అభంగపట్నం కు చెందిన యువకుడు వినోద్ కుమార్ (28) శుక్రవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-09-21 07:28 GMT

దిశ, నవీపేట్: మండలంలోని అభంగపట్నం కు చెందిన యువకుడు వినోద్ కుమార్ (28) శుక్రవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికులు, రైల్వే పోలీసుల సమాచారం మేరకు అభంగపట్నం కు చెందిన అల్లే వినోద్ కుమార్ ఈ మధ్యనే గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడని, తిరిగి మరొక గల్ఫ్ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసే క్రమంలో మెడికల్ ఫిట్ నెస్ లో ఫెయిల్ కావడం, అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి నవీపేట్ రైల్వే స్టేషన్ కు సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడని, స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకుని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించామని రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు.


Similar News