కారు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి

కారు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది.

Update: 2024-01-22 13:17 GMT

దిశ,టేకులపల్లి : కారు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్సై గన్ రెడ్డి రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కోయగూడెం గ్రామ పంచాయతీలోని భావోజితండాకు చెందిన అజ్మీర విక్రమ్ మాధవి దంపతుల కుమారుడు అజ్మీర సిద్ధార్థ్ (3) తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ఇంటి సమీపంలో ఉన్న కారు వెనుకకు తీస్తుండగా దాని వెనుక భాగంలో పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Similar News