రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Update: 2024-03-21 16:11 GMT

దిశ, మాచారెడ్డి : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... పాల్వంచ మండలం బండరామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన కమ్మరి పండరి (48) అనే వ్యక్తి మాచారెడ్డి నుంచి బండరామేశ్వర్ పల్లి గ్రామానికి సైకిల్ పై వెళుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ లో చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన వివరించారు. మృతుని భార్య కమ్మరి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. 


Similar News