రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల శివారులోని మంజీరా వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం బీర్కూర్ గ్రామానికి చెందిన కుర్మ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల శివారులోని మంజీరా వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం బీర్కూర్ గ్రామానికి చెందిన కుర్మ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బీర్కూర్ గ్రామానికి చెందిన కుర్మ రాజు మద్నూర్ మండలం కుర్లా గ్రామం నుండి బీర్కూర్ వైపునకు వస్తుండగా ఆయన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.