ఆసుపత్రి పైనుంచి పడి వ్యక్తి దుర్మరణం

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి చెందాడు.

Update: 2023-12-29 15:04 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరం ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం చెరువు తండాకు చెందిన అంబర్ సింగ్ (44) మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు.

    ఈ నెల 27న రాత్రి 9 గంటలకు మూర్చ రావడంతో అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. 28 న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మళ్లీ మూర్చ రావడంతో ప్రభుత్వ ఆసుపత్రి మొదటి అంతస్తు కిటికీ నుండి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. వెంటనే అక్కడి వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అంబర్ సింగ్ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. మృతుడి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు.  

Similar News