ఉరి వేసుకుని మైనర్ బాలిక ఆత్మహత్య
లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.
దిశ, లింగంపేట్ : లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. అదే గ్రామానికి చెందిన కొడవైన అశోక్ అనే యువకుడు సదరు మైనర్ బాలికతో గత రెండు సంవత్సరాలుగా ప్రేమాయణం సాగించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు పేర్కొన్నారు.
బాలిక తనను వివాహం చేసుకోవాలని సదరు యువకుడిని కోరాగా అతను నిరాకరించడంతో మనస్థాపం చెందిన మైనర్ బాలిక మంగళవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు కొడబోయిన అశోక్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మైనర్ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.