మద్యం మత్తులో బురద గుంతలో పడి వ్యక్తి మృతి

ఫుల్లుగా మందుకొట్టి మద్యం మత్తులో ఓ వ్యక్తి బురద నీటిలో పడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని నగర శివారులోని గుండారం కమాన్ వద్ద చోటు చేసుకుంది.

Update: 2024-09-08 08:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఫుల్లుగా మందుకొట్టి మద్యం మత్తులో ఓ వ్యక్తి బురద నీటిలో పడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని నగర శివారులోని గుండారం కమాన్ వద్ద చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ ఎస్ ఐ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాందేవాడకు చెందిన సంతలే జ్యోతిరాం (54) మద్యం మత్తులో గుండారం కమాన్ వద్ద బురద గుంటలో పడి మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


Similar News