బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద 2 లక్షల నగదు పట్టివేత

నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గేటు వద్ద జాతీయ రహదారిపై

Update: 2024-04-02 10:58 GMT

దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గేటు వద్ద జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ కలదు. ఈ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీల్లో 2 లక్షల రూపాయల నగదును పట్టుకున్నట్లు నిజాంసాగర్ ఎస్ ఐ కే.సుధాకర్ తెలిపారు. కడప జిల్లా,ఖాజీపేట మండలం, త్రిపురాపురం గ్రామానికి చెందిన భూమి రెడ్డి లక్ష్మారెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తన వాహనమైన కారులో కడప నుంచి హైదరాబాద్ మీదుగా ఎల్లారెడ్డి వైపునకు వెళ్తుండగా 2 లక్షల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళుతుండగా పట్టుకొని ఆ నగదును సీజ్ చేసినట్లు ఆయన తెలియజేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా డబ్బులను తరలించి నట్లయితే డబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పిట్లం ఏఎస్ఐ లింబాద్రి,పోలీస్ సిబ్బంది బాలరాజ్ పాల్గొన్నారు.


Similar News