బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద 2 లక్షల నగదు పట్టివేత
నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గేటు వద్ద జాతీయ రహదారిపై
దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గేటు వద్ద జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ కలదు. ఈ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీల్లో 2 లక్షల రూపాయల నగదును పట్టుకున్నట్లు నిజాంసాగర్ ఎస్ ఐ కే.సుధాకర్ తెలిపారు. కడప జిల్లా,ఖాజీపేట మండలం, త్రిపురాపురం గ్రామానికి చెందిన భూమి రెడ్డి లక్ష్మారెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తన వాహనమైన కారులో కడప నుంచి హైదరాబాద్ మీదుగా ఎల్లారెడ్డి వైపునకు వెళ్తుండగా 2 లక్షల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళుతుండగా పట్టుకొని ఆ నగదును సీజ్ చేసినట్లు ఆయన తెలియజేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా డబ్బులను తరలించి నట్లయితే డబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పిట్లం ఏఎస్ఐ లింబాద్రి,పోలీస్ సిబ్బంది బాలరాజ్ పాల్గొన్నారు.