యూజీ విద్యార్థులకు 100 శాతం హాస్టల్ కేటాయించాల్సిందే : నిజాం కాలేజీ విద్యార్థులు

నిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ విద్యార్థులకు100 శాతం హాస్టల్ కేటాయించాల్సిందేనని విద్యార్థులు ధర్నా చేస్తున్నారు.

Update: 2024-08-07 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ విద్యార్థులకు100 శాతం హాస్టల్ కేటాయించాల్సిందేనని విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఐదు రోజుల నుండి ఈ నిరసన కొనసాగుతోంది. కాగా బుధవారం చీకటిలోనూ నిరసన వ్యక్తం చేశారు. యూజీ విద్యార్థులకు వంద శాతం హాస్టల్ కేటాయించాలని, అప్పటి వరకు తమ పోరు ఆగదని, చీకట్లో అయినా నిరసన ఆపేది లేదని స్పష్టంచేశారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులకు సహకరించకుండా హాస్టల్ ను గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 50 శాతం, పీజీ విద్యార్థులకు 50 శాతం కేటాయిస్తామని చెప్పడం ఈ నిరసనకు కారణమైంది. హాస్టల్ వంద శాతం యూజీ విద్యార్థులకు కేటాయించాలని నిజాం కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News