రెండు మంత్రి పదవులిస్తే బీఆర్ఎస్ ను మొత్తం ఖాళీ చేస్తామంటున్నారు : మైనంపల్లి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది మాతో టచ్ లో ఉన్నారని.. రెండు మంత్రి పదవులిస్తే చాలు బీఆర్ఎస్ ను మొత్తం ఖాళీ చేస్తామని వారే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-24 10:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది మాతో టచ్ లో ఉన్నారని.. రెండు మంత్రి పదవులిస్తే చాలు బీఆర్ఎస్ ను మొత్తం ఖాళీ చేస్తామని వారే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన మైనంపల్లి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కేసీఆర్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది మాతో టచ్ లో ఉన్నారన్నారు. రెండు మంత్రి పదవులిస్తే చాలు మొత్తం 26మంది వస్తామని బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తామని చెబుతున్నారని వెల్లడించారు. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ తట్టుకోలేదని..ఆ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరూ ఉండరని..అప్పుడు కేసీఆర్ గుండె పగిలి చస్తే ఆ బద్నాం మా మీద పడ్తదని ఊరుకుంటున్నామన్నారు. కేసీఆర్ చస్తే ఆ సింపతితో ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నారని విమర్శించారు. ‘బావబామ్మర్దులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారన్నారు. అసలే సీఎం రేవంత్ రెడ్డి ఊరుకునే వ్యక్తి కాదని.. ఆయన ఏం అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారన్నారు. మీకు సరైన వ్యక్తి ఆయనేనని.. బావబామ్మర్దులు వారి బొందను వాళ్లే తొవ్వుకుంటున్నారు’ అని హనుమంతరావు అన్నారు. 

Tags:    

Similar News