అర్ధరాత్రి వైన్స్లో చోరీ.. దసరా పండుగా అమ్మకాలను మొత్తం ఎత్తుకెళ్లిన దొంగ
గుర్రంపోడు మండలం కేంద్రంలోని ఆదిత్య వైన్ షాప్లో అర్థ రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు.
దిశ, గుర్రంపొడు : గుర్రంపోడు మండలం కేంద్రంలోని ఆదిత్య వైన్ షాప్ల దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్థ రాత్రి దొంగతనానికి పాల్పడ్డ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దసరా పండుగ కలెక్షన్ మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారని వైన్ షాప్ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.