ఖైదీ పరార్... పోలీసులకు టెన్షన్...

కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువచ్చిన ఖైదీ పరారైన సంఘటన కోదాడ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.

Update: 2024-08-29 16:47 GMT

దిశ, కోదాడ: కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువచ్చిన ఖైదీ పరారైన సంఘటన కోదాడ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన మామిడి గోపి అనే వ్యక్తి పలు దొంగతనాల కేసుల్లో ఖమ్మం పోలీస్ స్టేషన్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే కోదాడ పట్టణానికి సంబంధించి ఓ బైకు దొంగతనం కేసు విచారణలో భాగంగా నిందితుడిని ఖమ్మం జిల్లా జైలు నుండి కోదాడ కోర్టుకు తీసుకువస్తుండగా పోలీసుల కళ్ళు కప్పి పరారైనట్లుగా సమాచారం. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 


Similar News