రోడ్డు ప్రమాదంలో తల్లీబిడ్డలకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో తల్లి బిడ్డలకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం హాలియా పట్టణంలో జరిగింది.

Update: 2024-09-21 16:24 GMT

దిశ, హాలియా: రోడ్డు ప్రమాదంలో తల్లి బిడ్డలకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం హాలియా పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలం బొక్కమంతల పాడు గ్రామానికి చెందిన గ్యాల విక్రం, భార్య శ్రావణి 8 నెలల చిన్నారితో హాలియా కు వచ్చారు. దంపతులు ఇంటికి అవసరమైన సరుకులను కొనుగోలు చేసిన అనంతరం బైక్ పై  వస్తుండగా లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు లారీ పక్కన పడింది. బైక్ పై ఉన్న భార్య శ్రావణి, చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే నల్గొండ కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.


Similar News