జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సామూహిక సెలవు

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో నిర్వహిస్తున్న

Update: 2024-09-25 14:58 GMT

దిశ,పెద్దఅడిశర్లపల్లి : నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ముక్కుముడిగాడిగా సామూహిక సెలవులు పెట్టారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సామూహిక సెలవు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని అంశాలతో కూడిన డిమాండ్లను ముందుకు తీసుకొచ్చారు.

నల్గొండ జిల్లాలో సస్పెండ్ చేసిన తొలగించిన కార్యదర్శులను వెంటనే విధులకు చేర్చుకోవాలి. గత తొమ్మిది నెలల నుంచి గ్రామపంచాయతీలో ఖర్చు పెట్టిన డబ్బులను వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇతర ఏ జిల్లాలో లేని గ్రామపంచాయతీ స్పెషల్ ఆడిట్లను తీసివేసి, ఎమ్మెస్ ఓ ల బెదిరింపులు ఇబ్బందులు లేకుండా ఉద్యోగస్తుల లాగా చూడాలని డిమాండ్ చేశారు.


Similar News