సూర్యాపేటకు తెలంగాణ గవర్నర్.. ఘనస్వాగతం పలికిన మంత్రి..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూర్యాపేటకు వచ్చారు.

Update: 2024-10-24 08:11 GMT

దిశ, సూర్యాపేట టౌన్/ కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూర్యాపేటకు వచ్చారు. వారికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఘనస్వాగతం పలికారు. సూర్యాపేట కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆయన తిలకించారు. అనంతరం అధికారులను పరిచయం చేసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.


Similar News