దిశ, తుర్కపల్లి(ఎం): గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్తో ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి(ఎం) మండలం దత్తాయపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఆదివారం కావడంతో గ్రామంలోని గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో జిట్ట రాజు కుమారుడు జిట్టా ఆదిత్య(7) మండపం వద్ద విద్యుత్ వైర్ తగిలి.. కరెంట్ షాక్తో కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన ఆదిత్యను భువనగిరి ఏరియా హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ఆదిత్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వినాయక మండపాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ వాడకంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.