ఉధృతంగా అలుగు పోస్తున్న ఆమనగల్ చెరువు

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన మండలంలోని ఆమనగల్ చెరువు అలుగు పోస్తుంది.

Update: 2024-09-01 05:19 GMT

దిశ, వేములపల్లి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన మండలంలోని ఆమనగల్ చెరువు అలుగు పోస్తుంది. దీంతో లక్ష్మీదేవి గూడెం గ్రామ సమీపంలోని కల్వరి మీదుగా వరద ప్రవాహం భారీగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భీమారం-సూర్యాపేట రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండడం వలన మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీంతో లక్ష్మీదేవి గూడెం, ఆమనగల్లు, భీమారం గ్రామాలకు పూర్తిస్థాయిలో రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో పాటు మండలంలోని శెట్టిపాలెం సమీపంలో గల చిత్ర పరక వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో శెట్టి పాలెం గ్రామానికి రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. ఇదిలా ఉంటే చెరువు అలుగులో మత్స్యకారుల సందడి నెలకొంది. ఆమనగల్ చెరువు ఆ ప్రాంతంలో పెద్దది కావడంతో భారీ ఎత్తున చేపలు ఉంటాయి. దీంతో అలుగులో చేపలు పట్టేందుకు పెద్ద ఎత్తున మత్స్యకారులు పక్క మండలాల నుంచి అక్కడకు చేరుకుంటున్నారు.


Similar News