'కార్యకర్తలే నా బలం.. నా జన్మంతా రుణపడి ఉంటా'

Update: 2023-09-24 13:36 GMT

దిశ, దేవరకొండ/ చింతపల్లి: కార్యకర్తలే నా బలం! నా బలగం! వారికి నా జన్మంత రుణపడి ఉంటా!! అని మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని కుర్మేడ్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రశాంత పూరి తండా గ్రామపంచాయతీకి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు100 మంది నేనావత్ బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


అనంతరం భాగ్యమ్మ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండిన ఈసారి దేవరకొండ ఖిల్లా పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తుందని, బీఆర్ఎస్.. బడుగు బలహీన వర్గాల ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీడిస్తుందని ఆయన ఫైరయ్యారు. ధరణి తీసుకువచ్చి ధరణి పోర్టల్‌లో రైతులను మోసం చేసిందని అన్నారు.


Similar News