బండరాళ్లు పడి కార్మికుడు మృతి..

పెద్దవూర మండలం సుంకిశాలలో వాటర్ పంప్ హౌస్ నిర్మాణం చేపడుతుండగా ప్రమాదం జరిగింది.

Update: 2023-09-08 14:40 GMT

దిశ, పెద్దవూర: పెద్దవూర మండలం సుంకిశాలలో వాటర్ పంప్ హౌస్ నిర్మాణం చేపడుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బండరాళ్లు పడి కార్మికుడు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకిశాల ప్రాజెక్ట్ నందు నలుగురు వర్కర్స్ పంప్ హౌస్‌లో పని చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు పంప్ హౌస్ నుండి బండరాళ్లు పడ్డాయి.

దీంతో పని చేస్తున్న కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అందులో బికాస్(20), చనిపోగా, అజయ్ ఠాకూర్, రబి ముడి, రాహుల్ కుమార్, కార్తీక్ మాలిక్, గత్తు మాలిక్‌లు గాయ పడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినారు. మృతుని స్నేహితుడు పవన్ సింగ్ సర్ధార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.


Similar News