గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మహిళ మృతదేహం దురాజు పల్లి సమీపంలోని మూసి కెనాల్ లో లభ్యమైంది.

Update: 2024-10-11 14:36 GMT

దిశ ,చివ్వేంల : గుర్తు తెలియని మహిళ మృతదేహం దురాజు పల్లి సమీపంలోని మూసి కెనాల్ లో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం స్థానికులు పశువుల దగ్గరికి వెళ్ళగా కెనాల్ లోని సుడిగుండం వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మున్సిపాలిటీ వారి సహకారంతో మృతదేహాన్ని వెలికి తీశారు. వివరాలు ఆరా తీయగా.. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు ఉన్నాయి. కాళ్లకు వెండి కడియాలు,చెవులకు దిద్దులు, మాటీలు, కలవు రెండు చేతులకు పచ్చబొట్లు, రెండు చేతులకు గిల్డ్ గాజులు ఎడమ చేతిపై ముత్తమ్మ అని పచ్చబొట్టు ఉంది. పసుపు రంగు నైలాన్ చీర దానిపై రెడ్ కలర్ పూలు ,నలుపు రంగు జాకెట్ పై ఎల్లో కలర్ పూల డిజైన్ ఉన్నాయి. సూర్యాపేట ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని ఎస్సై వెంకట్ రెడ్డి, తెలిపారు.


Similar News