జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ముస్లిం దంపతులు

జోగులాంబ అమ్మవారిని ముస్లిం దంపతులు దర్శించుకున్నారు. సాధారణంగా హిందూ దేవాలయాలకు ఇతర మతాలకు చెందిన వాళ్లు రావడం చాలా అరుదుగా చూస్తుంటాం.

Update: 2022-08-22 17:12 GMT

దిశ, అలంపూర్ : జోగులాంబ అమ్మవారిని ముస్లిం దంపతులు దర్శించుకున్నారు. సాధారణంగా హిందూ దేవాలయాలకు ఇతర మతాలకు చెందిన వాళ్లు రావడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటిది శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు సోమవారం ముస్లిం దంపతులు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దేవరకద్ర మండలానికి చెందిన ఇమ్రాన్, అయోష దంపతులు తమ రెండేళ్ల బాబుతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. చాలా రోజుల నుండి అమ్మవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నట్లు ఆ దంపతులు తెలిపారు. ఆలయానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనసుల్లో అనుకోని మొక్కుబడి తీర్చడానికి వచ్చాము అని అయోష తెలిపింది.


Similar News