సీఎం రేవంత్‌తో ఎంపీ అర్వింద్ భేటీ.. కారణం ఇదే?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ లీడర్ ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు.

Update: 2024-07-05 08:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ లీడర్ ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7న దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి బంజారాహిల్స్ నివాసంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మృతికి ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి.. డీఎస్ సతీమణి విజయ‌లక్ష్మికి సంతాప లేఖ రాశారు. ఈ లేఖలపై ఎంపీ అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో మా కుటుంబం పట్ల సానుభూతి తెలిపినందుకు నేను మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాని ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News