MLC Kavitha: ఐదు నెలల తరువాత నగరానికి కవిత.. సంబురాలకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ శ్రేణులు
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మంగళవారం రాత్రి తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
దిశ, వెబ్డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మంగళవారం రాత్రి తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2.45 గం.కు ఆమె ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 5 గం.కు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. కాగా, కవిత ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బస చేశారు. ఆమెతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులున్నారు. చాలా రోజుల తరువాత జైలులో ఉండి నగరానికి వస్తున్న కవిత కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ మేరకు నగరం అంతా గులాబీమయం అయింది. నగరంలోని ప్రధాన కూడాళ్లలో కవితకు స్వాగతం తెలుపుతూ ఫ్లెక్లీలు వెలిశాయి.