Governor Haribabu : మిజోరం గవర్నర్ హరిబాబుకు అస్వస్థత!

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత నెలకొన్నట్లు సమాచారం.

Update: 2024-09-09 09:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత నెలకొన్నట్లు సమాచారం. హైదరాబాద్ పర్యటనలో ఉన్న మిజోరం గవర్నర్ హరిబాబు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనను అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

గవర్నర్‌ను తరలించేందుకు ఎయిర్ పోర్టు అధికారులు ఎమర్జెన్సీగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, బీజేపీలో కీలకంగా ఉన్న హరిబాబుకు మిజోరం గవర్నర్‌ పదవి దక్కిన విషయం తెలిసిందే.


Similar News