కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ అభ్యర్థన

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి(NDA Government) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-17 13:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి(NDA Government) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈ ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతోందని అన్నారు. దీంతో రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇదిలా ఉండగా.. వరి ధాన్యానికి సంబంధించిన బోనస్‌పై ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సన్న వడ్లకు క్వింటాపై రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ ఖరీఫ్ నుంచే బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటామని అన్నారు. వరి సాధారణ రకానికి రూ.2,300, ఏ-గ్రేడు వరికి రూ.2,320 మద్దతు ధర ఉండగా.. రూ. 500 బోనస్ కలిపి రైతులకు అందజేయనున్నట్లు చెప్పారు. 18 రకాల సన్న రకం ధాన్యానికి ఈ బోనస్ వర్తించనుందని మంత్రి వెల్లడించారు.


Similar News