Seetakka: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టారు.

Update: 2024-08-19 05:58 GMT

దిశ, వెబ్ డెస్క్: రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సోమవారం తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ లోక్ సభలో నామినేషన్ వేశారు. అనంతరం మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన నివాసానికి వెళ్లింది. అక్కడే సీఎంకు సీతక్క రాఖీ కట్టారు. అనంతరం రేవంత్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి మనవడికి కూడా సీతక్క రాఖీ కట్టింది. అలాగే ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాలువ సుజాత, తదితరులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.

 


Similar News