కేసీఆర్ చవట దద్దమ్మ.. ఆయన్ను పాతిపెట్టాలి : మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు

‘కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాలరని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

Update: 2024-04-06 08:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాలరని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ప్రాంతీయడు తన ప్రాంతానికి అన్యాయం చేస్తే అదే ప్రాంతంలోనే పాతి పెట్టాలి అనే సామెత ప్రకారం కేసీఆర్‌ను పాతి పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి గాంధీభవన్‌లో మీడియాలో మాట్లాడారు. పదేళ్లలో ఎప్పుడైనా కేసీఆర్ పంట నష్టం ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పండి ప్రభుత్వాన్ని నడిపించారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనను చూసి కేసీఆర్ అసూయపడుతున్నారు. ఈయన కుర్చీవేసుకొని కడుతా అన్న హామీలు ఒక్కటైనా అమలు అయ్యాయా? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు దమ్ముంటే మేడిగడ్డ కాదు.. పాలమూరుకు పోదామన్నారు. మిషన్ భగీరథలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12సార్లు ఢిల్లీకి వెళ్లివచ్చినా.. సోనియా, ఖర్గే అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే కేసీఆర్ హైదరాబాద్‌లో ఉన్నా మంత్రులను కలవలేదన్నారు. ఈయన తలకిందులుగా తపస్సు చేసినా లోక్‌సభలో ఒక్క సీటు కూడా రాదు. కేసీఆర్ వ్యవహారాలన్ని మేమంతా పక్కనుండి చూశామన్నారు. ఇకపై కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని జూపల్లి అన్నారు.


Similar News