ఆదివాసీ మహిళపై దాడి.. ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో ఆదివాసీ మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనపై మంత్రి జూపల్లి సీరియస్ అయ్యారు.
దిశ, వెబ్డెస్క్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో ఆదివాసీ మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనపై మంత్రి జూపల్లి సీరియస్ అయ్యారు. శనివారం బాధిత మహిళను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మొలచింతపల్లిలో ఆదివాసీ మహిళను నిర్భందించి పది రోజులు చిత్రహింసలు పెట్టారన్నారు. బాధిత మహిళకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే రాజకీయాలకు అతీతంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.