గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-07-08 15:47 GMT

దిశ,ఉప్పల్: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం సూరిశెట్టి మోహన్(27) అనే వ్యక్తి ఎన్ఎస్ఎల్ బిల్డింగులో ఆటో కార్డ్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చే నెలసరి జీతం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలని అత్యాశతో ఆంధ్రప్రదేశ్ పాడేరు కు చెందిన చిన్నారావు అనే వ్యక్తి దగ్గర గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ రామంతాపూర్ నెహ్రూ నగర్ లో ఉంటున్న బాచుపల్లి దేవానంద్ కు(26) అమ్ముతున్నాడని విశ్వసనీయమైన సమాచారం.

ఈ మేరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఎన్డిపిఎస్ సవరణ చట్టం 1985 ప్రకారం కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజరుపరిచారు. మరో వ్యక్తి A3 చిన్నారావు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 1100 గ్రాముల గంజాయి,రెండు మొబైల్ ఫోన్లు,ఒక బైక్, ఓ సి బి పేపర్స్ ఐదు పెట్టెలు, సిగరెట్స్ 14 పెట్టెలు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News