గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు..

శామీర్ పేట పెద్ద చెరువులోని గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్.

Update: 2024-09-16 10:49 GMT

దిశ, శామీర్ పేట : శామీర్ పేట పెద్ద చెరువులోని గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్. సోమవారం శామీర్ పేట పెద్ద చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని, తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చెయ్యాలని కోరారు.

భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూముకుంట మున్సిపల్ కమిషనర్ జి.వెంకట గోపాల్, సీఐ శ్రీనాథ్, డీసీసీ అధ్యక్షులు హరి వర్ధన్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్, తూముకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయపాల్ రెడ్డి, శామీర్ పేట మండల అధ్యక్షులు వైయస్ గౌడ్, కట్ట మైసమ్మ దేవాలయ చైర్మన్ వి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.


Similar News