Etela Rajender : బీజేపీ బాజాప్త రాజకీయ పార్టీయే..

బీజేపీ బాజాప్త రాజకీయ పార్టీ అని, జంగమయ్యల పార్టీ కాదు అని

Update: 2024-09-10 09:31 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో : బీజేపీ బాజాప్త రాజకీయ పార్టీ అని, జంగమయ్యల పార్టీ కాదు అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.బీజేపీ ఏలుబడి లోనే భారత దేశం సుభిక్షంగా,సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.తెలంగాణలో కూడా వ్యక్తులకోసం కాకుండా.. స్వచ్ఛమైన నీతివంతమైన పాలన సాగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రపంచ చిత్ర పటం మీద భారతదేశ ఔన్నత్యాన్ని సగౌరవంగా నిలబెట్టిన బిడ్డ ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు.మంగళవారం మేడ్చల్ రూరల్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ... పూడూరు గ్రామం, షామీర్ పేట మండలం నాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చిందన్నారు.

రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది చేరికలతో బిజెపి పటిష్టంగా తయారు కాబోతుంది జోస్యం చెప్పారు. పార్టీ ఎదుగుదల కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు. ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యాన్ని సగౌరవంగా నిలబెట్టిన బిడ్డ నరేంద్రమోదీ అని పేర్కొన్నారు. దీనిని మరింత ముందుకు తీసుకు పోవాలంటే మోదీకి 400 సీట్లు ఇద్దామని కోరుకున్నాం కానీ.. ఎక్కడో దారి తప్పింది అని ప్రజలు అనుకుంటున్నారనీ అన్నారు. రష్యా, ఉక్రెయిన్ లో శాంతి కావాలంటే మోదీ రావాలని ఇరుదేశాలు ప్రెసిడెంట్ లు కోరుతున్నారని చెప్పారు.

నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని అయిన వ్యక్తి నరేంద్ర మోదీ అని అన్నారు. ఈ విజయాన్ని కూడా చూడలేని అంధులు వారు అని ప్రతిపక్ష పార్టీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా నా సొంత జిల్లా, ఎక్కువ సభ్యత్వం కావాలని, బీజేపీ లక్ష్యం పెట్టుకున్న 50 లక్షల సభ్యత్వం కావాలంటే ప్రతి ఇంటికి వెళ్లాలని కోరారు. నాయకులు సామర్థ్యం నాకు తెలుసు తెలంగాణలో అత్యధిక సభ్యత్వ నమోదు మల్కాజ్గిరి నియోజకవర్గంలో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు పీసరి సుధాకర్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, చంద్ర శేఖర్, మల్లికార్జున్, సుదర్శన్ రెడ్డి, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News