నల్ల పోచమ్మ ఆలయంలో చోరీ

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఓ ఆలయంలో అర్ధరాత్రి దొంగలు చోరపడి చోరీ చేశారు.

Update: 2024-07-06 10:15 GMT

దిశ, పేట్ బషీరాబాద్: పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఓ ఆలయంలో అర్ధరాత్రి దొంగలు చోరపడి చోరీ చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలోని నల్ల పోచమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఇనుప రాడ్డుతో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి హుండీలో ఉన్న డబ్బులు దోచుకెళ్లారు. ఎప్పటి లాగానే ఆలయాన్ని ఉదయం సమయంలో తెరవడానికి వచ్చిన వారు ఈ చోరిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.


Similar News