అమ్మవారి అలంకరణలో చీరకు బదులు, ఫ్రాక్..

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో శ్రీ నిమిషంబికా మాత దేవాలయంలో పూజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-04 13:52 GMT

దిశ, మేడిపల్లి : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో శ్రీ నిమిషంబికా మాత దేవాలయంలో పూజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి ఆకారంలో చీర కట్టించకుండా ఫ్రాక్ ఎలా వేస్తారాంటూ భక్తులు ప్రశ్నించారు. దీంతో పూజారి భక్తులతో దురుసుగా మాట్లాడుతూ అమ్మవారు లోపల బట్టలు లేకుండా లేరని, మీలాగా విరబోసుకుని లేరని భక్తుల పై పూజారి చందు శర్మ చిందులు వేశారు. దీంతో భక్తులు పూజారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజారి చందు శర్మ పై చర్యలు తీసుకోవాలని భక్తులు ఆలయ కమిటీని కోరారు.


Similar News