'భారత దేశం గౌరవం, స్వేచ్ఛ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది'

Update: 2023-08-13 10:44 GMT

దిశ, మేడ్చల్ టౌన్: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బీజేపీ నాయకులు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఐటీఐ కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. విదేశీ పాలన కింద నలిగిన భారతీయులు కొన్ని సంవత్సరాల ఉద్యమాలు, తర్వాత అమరుల త్యాగల ఫలితం స్వతంత్రం వచ్చిందని అన్నారు. ప్రజలకు ఆస్తులు, అంతస్తులు ఉండొచ్చు పోవచ్చు కానీ దేశం యొక్క గౌరవం స్వేచ్ఛ కాపాడుకోవాల్సిన కర్తవ్యం మనందరి ఉందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ది శ్రీనివాస్, మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిలు తిరుమల రెడ్డి, విజయ్ కుమార్, బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ఉపధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి, జగన్ గౌడ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ బీజేవైఎం నాయకులు రాగం ఆనంద్, కేశవరెడ్డి, భరత్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News