కూకట్పల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే
కూకట్పల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. డివిజన్ పరిధిలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, వివిధ శాఖలు, విభాగాల అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. డివిజన్ పరిధిలోని ప్రశాంత్నగర్ కాలనీ రోడ్డు, ప్రకాష్ నగర్ హైటెన్షన్ రోడ్డులో డ్రైనేజి సమస్యను పరిశీలించారు. అనంతరం వార్డు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ వర్షకాలంను దృష్టిలో ఉంచుకుని దోమల నివారణకు ఎంటమాలజీ విభాగం, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పారిశుద్ధ్య విభాగం సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఆషాడ బోనాలను దృష్టిలో ఉంచుకుని దేవాలయాల వద్ద పారిశుద్ధ్య పనులను, రోడ్డు మరమ్మతు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఈఈ గోవర్ధన్ గౌడ్, ఏఈ శివప్రకాష్, జలమండలి డిజిఎం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు సంతోష్, ప్రభాకర్, బొట్టు విష్ణు తదితరులు పాల్గొన్నారు.