MLA Sunitha : ప్రోటోకాల్ ఉల్లంఘన పై స్పీకర్ దృష్టికి తీసుకెళ్తా

ప్రోటోకాల్ ఉల్లంఘన పై స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు.

Update: 2024-10-27 11:42 GMT

దిశ, నర్సాపూర్: ప్రోటోకాల్ ఉల్లంఘన పై స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో కేసీఆర్ 100 సీట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే , దాన్ని 50 సీట్లకు కుదించి 24 వ తేదీన మెడికల్ కాలేజీని మంత్రుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారని ఆ సమయంలో ఒక మహిళా ఎమ్మెల్యే అయిన నన్ను అహ్వానించక అగౌరవపర్చరాని ఆరోపించారు. ప్రోటోకాల్ లేనివాళ్లను అధికారులు ఎలా వేదిక పైకి పిలుస్తారని మండిపడ్డారు. మొన్న హత్నూర మండలం దౌల్తాబాద్ ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభోత్సవంలో కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించారని అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన అనేది పరిపాటిగా మారిందని, ఈ ప్రోటో కాల్ ఉల్లంఘన పైన స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.


Similar News