దేవతా విగ్రహాల ధ్వంసానికి నిరసనగా రేగోడ్ బంద్

రాష్ట్రంలోని గుడులలో జరుగుతున్న దేవతామూర్తుల

Update: 2024-10-25 06:50 GMT

దిశ, రేగోడ్: రాష్ట్రంలోని గుడులలో జరుగుతున్న దేవతామూర్తుల ధ్వంసానికి నిరసనగా మండల కేంద్రమైన రేగోడ్ లో శుక్రవారం బంద్ జరిగింది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరిన హిందువులు విధ్వంస కారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘాల పిలుపు మేరకు దుకాణాలు, హోటళ్లు స్వచ్చంధ బందును పాటించాయి. హిందూ దేవాలయాలపై ఉద్యేశపూర్వకంగా జరుగుతున్న దాడులను నిరోధించేందుకు చర్యలను తీసుకోవడంలో భాగంగా నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.


Similar News