బురద గుంటగా మారిన రోడ్డు..

చినుకు పడితే చాలు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Update: 2024-10-16 06:18 GMT

దిశ, మద్దూరు : చినుకు పడితే చాలు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మద్దూరు మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు సమీపంలోని కల్వర్టుకు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతుండడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎర్రమట్టి పోసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. గుంతలు పడ్డ కల్వర్టుకు సిమెంట్ కంకర వేసి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను వాహనదారులతో పాటు మండల ప్రజలు కోరుకుంటున్నారు.


Similar News