ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

Update: 2024-08-17 15:41 GMT

దిశ, ములుగు : వివాహిత మహిళతన ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రం ములుగులో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ములుగుకు చెందిన మర్కంటి స్వామికి తన భార్య భానుప్రియతో శుక్రవారం రాత్రి తగాదా జరగడంతో మనస్థాపానికి గురైన భానుప్రియ (28) తన ఇద్దరు పిల్లలు ఆనంద్ (5) దీక్ష (4)తో కలిసి శనివారం తెల్లవారుజామున ఇంటి నుండి వెళ్ళిపోయింది. భర్త స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా వారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News