పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన
పెండింగ్ బిల్లులు, హక్కుల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆశా వర్కర్లు ప్రభుత్వానికి హెచ్చరించారు.

దిశ, కోహీర్: పెండింగ్ బిల్లులు, హక్కుల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆశా వర్కర్లు ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం తహసిల్దార్ బాల శంకర్ కు వినతి పత్రం సమర్పించారు. గత మూడేళ్లుగా చేసిన వివిధ ప్రభుత్వ పనులకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందన్నారు. పెండింగ్ బిల్లులు, హక్కుల సాధన కోసం ఈ నెల 17,19, 21,24 తేదీలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 17 తేది నుంచి 30 తేది వరకు నిర్వహించ తలపెట్టిన సర్వే పనులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు శివలీల, సునీత, స్వరూప, శారద, నాగ లక్ష్మి, నిర్మల, సువర్ణ, కల్పన, అనురాధ, రేణుక, ప్రమీల, నిరూపమ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.