Collector : ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి

ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-01 11:31 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట మున్సిపాలిటీ మారుతీ నగర్ వెంచర్ లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సర్వర్ సమస్యలు, ఓపెన్ ప్లాట్ యజమాని ఆసక్తి కనబరచక పోవడం, ఇతరత్రా కారణాల మూలంగా ప్రక్రియ ఆలస్యం అవుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈకార్యక్రమంలో సుడా డీటీసీపీఓ వందనం, మున్సిపల్ టీపీఓ నస్రీన్ భాను, అధికారులు దేవరాజు, ఎల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.


Similar News