ప్రజావాణి రద్దు..విద్యాసంస్థలకు సెలవు..

అధిక వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 2 వ తేది సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ప్రకటనలో తెలిపారు.

Update: 2024-09-01 15:18 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అధిక వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 2 వ తేది సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. మరుసటి సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఐటీఐలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు ఈనెల 2వ తేది సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆదేశాలను అమలు చేయాలని విద్య సంస్థల నిర్వాహకులకు సూచించారు.


Similar News