తాటిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి

ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి జారిపడి మృతి చెందిన ఘటన కొమురవెల్లి మండలం ఐనాపూర్ లో చోటుచేసుకుంది.

Update: 2024-10-28 14:40 GMT

దిశ, కొమురవెల్లి : ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి జారిపడి మృతి చెందిన ఘటన కొమురవెల్లి మండలం ఐనాపూర్ లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుడిగే కిష్టయ్య గీత వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో కాలు జారి కిందపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఐదుగురు కుమారులు ఉన్నారు. మృతుడికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


Similar News