Mahesh Kumar Goud: పొంగులేటి బాంబ్ కోసం నేనూ ఎదురుచూస్తున్నా..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) పేల్చబోయే బాంబుల కోసం తానూ ఎదురుచూస్తున్నట్లు పీసీసీ ప్రెసిడెంట్

Update: 2024-10-26 12:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) పేల్చబోయే బాంబుల కోసం తానూ ఎదురుచూస్తున్నట్లు పీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆ బాంబుల కోసం తాను కూడా ఆగలేకపోతున్నానని అన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్లు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని తెలిపారు. మూసీ(Musi)పైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విడతల వారీగా మూసీ ప్రక్షాళన ఉంటుందని తెలిపారు.

హైడ్రాతో పేదలకు ఎంతమాత్రం నష్టం జరుగదని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. పార్టీలో కొత్త, పాత కలయికలతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయి. ఈ చేరికల విషయంలో జీవన్ రెడ్డి(Jeevan Reddy)తో మాట్లాడాం. జీవన్ రెడ్డికి పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. కేబినెట్ విస్తరణ అనేది సీఎం, పార్టీ అధిష్టానం చేతుల్లో ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Tags:    

Similar News