ఉమ్మడి పాలమూరు జిల్లాలో నలుగురు ఎస్పీల బదిలీ..

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నలుగురు ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ.

Update: 2023-10-11 17:03 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నలుగురు ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ. మహబూబ్ నగర్ ఎస్పీ కె. నరసింహ, జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కే. సృజన, నాగర్ కర్నూల్ జిల్లా కే. మనోహర్, నారాయణపేట వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు విధుల్లో చేరి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో బదిలీ కాగా జోగులాంబ గద్వాల జిల్లా, మహబూబ్ నగర్ ఎస్పీలు బాధ్యతలు స్వీకరించిన 9 నెలలకే బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరికి స్థానాలు ఎక్కడ కేటాయించేది.. కొత్తగా వచ్చే ఎస్పీలు ఎవరు అన్న వివరాలు ఈ రాత్రి పొద్దుపోయిన తర్వాత.. ఒకటి రెండు రోజులలో కానీ వివరాలు అందే అవకాశం ఉంది.


Similar News