పిడిఎస్ బియ్యం పట్టివేత..ఇద్దరిపై కేసు నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం వెలుగొండ గేటు సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.

Update: 2024-10-06 16:07 GMT

దిశ బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం వెలుగొండ గేటు సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో వెలుగొండ స్టేజి వద్ద పిడిఎస్ బియ్యాన్ని ఒక టాటా ఏసీ ఆటోలో తరలిస్తుండడంతో..గమనించిన పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 17 ప్లాస్టిక్ బ్యాగ్స్ పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న భాస్కర్, రసీదులపై కేసు నమోదు చేశామని బిజినాపల్లి ఎస్ఐ నాగ శేకరరెడ్డి తెలిపారు.


Similar News